ETV Bharat / state

మెడికల్‌, డెంటల్‌ పరీక్షల నిర్వాహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

author img

By

Published : Jun 19, 2020, 7:59 PM IST

రేపటి నుంచి పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో శనివారం నుంచి జరగనున్న పీజీ వైద్య, దంత పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

high-court-green-signal-for-conducting-pg-medical-and-dental-exams-in-telangana
మెడికల్‌, డెంటల్‌ పరీక్షల నిర్వాహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలో శనివారం నుంచి పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కరోనా తీవ్రత దృష్టా రేపటి నుంచి ఈనెల 29 వరకు జరగనున్న పీజీ వైద్య, దంత పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ హెల్త్ కేర్ రిఫర్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఆస్పత్రుల్లో పని చేస్తున్న పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, మరికొందరు క్వారంటైన్‌లో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకున్నట్లు కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు హైకోర్టుకు నివేదించారు.

ఎవరైనా విద్యార్థులు పరీక్ష రాయలేకపోతే వారిని సప్లమెంటరీలో రాసేందుకు అనుమతిస్తామని కాళోజి యూనివర్సిటీ హైకోర్టుకు తెలిపింది. సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ప్రాక్టికల్ పరీక్షలను సిమ్యులేషన్ విధానంలో నిర్వహిస్తామని.. పేషెంట్లను కలవాల్సిన అవసరం లేదని తెలిపింది.

యూనివర్సిటీ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. పరీక్షల నిర్వాహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ... గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: భారత్​-చైనా 'శాంతి' చర్చలు ఇక ముగిసినట్టేనా?

రాష్ట్రంలో శనివారం నుంచి పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కరోనా తీవ్రత దృష్టా రేపటి నుంచి ఈనెల 29 వరకు జరగనున్న పీజీ వైద్య, దంత పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ హెల్త్ కేర్ రిఫర్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఆస్పత్రుల్లో పని చేస్తున్న పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, మరికొందరు క్వారంటైన్‌లో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకున్నట్లు కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు హైకోర్టుకు నివేదించారు.

ఎవరైనా విద్యార్థులు పరీక్ష రాయలేకపోతే వారిని సప్లమెంటరీలో రాసేందుకు అనుమతిస్తామని కాళోజి యూనివర్సిటీ హైకోర్టుకు తెలిపింది. సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ప్రాక్టికల్ పరీక్షలను సిమ్యులేషన్ విధానంలో నిర్వహిస్తామని.. పేషెంట్లను కలవాల్సిన అవసరం లేదని తెలిపింది.

యూనివర్సిటీ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. పరీక్షల నిర్వాహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ... గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: భారత్​-చైనా 'శాంతి' చర్చలు ఇక ముగిసినట్టేనా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.